బ్రిటన్‌లో ముగిసిన రాజ్‌నాథ్‌ పర్యటన

Defence Minister Rajnath Singh meets U.K. Prime Minister Rishi Sunak in London
  •  చివరి రోజు రిషి సునాక్‌తో భేటీ

లండన్‌ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రెండు రోజుల ఇంగ్లండ్‌ పర్యటన గురువారం ముగిసింది. చివరి రోజు ఆయన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ సమావేశమయ్యారు. అలాగే ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక కార్యాక్రమాల్లోనూ రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. సునాక్‌తో భేటీ ‘ఆశాజనక వాతావరణం’లో జరిగిందని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌తోనూ రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు.

➡️