ప్రమాదకరంగా డ్రైనేజీ బల్లలు

Mar 25,2024 13:02 #Konaseema

ప్రజాశక్తి-మండపేట : మండపేట పట్టణ పరిధిలోని రాజారత్న జంక్షన్ లోని డ్రైనేజీపై ఉన్న బల్లలు ప్రమాదకరంగా మారాయి. వాటిని రోడ్డు సమాంతరంగా పెట్టకపోవడంతో రోడ్డు కంటే ఎత్తుగా ఉండి ప్రమాదాలను తలపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే
ఈ జంక్షన్ లో ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోక ముందే మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

➡️