తెలంగాణ : ‘ నాన్నగారు త్వరలోనే కోలుకుంటారు ‘ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా చెప్పారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలుజారిపడటంతో ఆయన తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ … కెసిఆర్ గారికి స్వల్ప గాయం అయిందని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ” అందరి ప్రార్థనలు, ఆకాంక్షలతో నాన్న త్వరలోనే కోలుకుంటారు ” అని చెప్పారు. ” మీ అభిమానానికి ధన్యవాదాలు ” అని ట్వీట్ చేశారు.