బిర్యానీ బాగాలేదన్న కస్టమర్లు.. చితక్కొట్టిన హోటల్‌ సిబ్బంది..

Jan 1,2024 17:15 #briyani, #Telangana

హైదరాబాద్‌: బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లిన కస్టమర్లను చితక్కొట్టిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి బిర్యానీ తినడానికి ఓ కుటుంబం అబిడ్స్‌లోని రెస్టారెంట్‌కు వెళ్లింది. మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు హోటల్‌కు వెళ్లి.. బిర్యానీ ఆర్డర్‌ చేశారు. వారు ఆర్డర్‌ చేసిన బిర్యానీ సరిగ్గా ఉడకలేదు. దీంతో బిర్యానీ బాగా లేదని ఆ ఫ్యామిలీ.. హోటల్‌ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదన జరిగింది. ఈ క్రమంలో హోటల్‌ సిబ్బంది.. ఆ ఫ్యామిలీపై కర్రలతో దాడి చేశారు. కొంతమంది వెయిటర్లు తమకు దొరికిన వస్తువులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి దృశ్యాలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనకు సంబంధించి సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు హోటల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

➡️