- మండలి అధ్యక్షులు డెన్నిస్ ఫ్రాన్సిస్
న్యూఢిల్లీ : ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలు ఐరాస భద్రతా మండలిలో ప్రతిబింబించడం లేదని మండలి అధ్యక్షులు డెన్నిస్ ఫ్రాన్సిస్ అంగీకరించారు. అలాగే భద్రతా మండలిలో సంస్కరణలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని కూడా ఫ్రాన్సిస్ అంగీకరించారు. ప్రస్తుతం ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్లో ఫ్రాన్సిస్ పర్యటిస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆహ్వానం మేరకు సోమవారం ఫ్రాన్సిస్ భారత్్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భద్రతా మండలి నిర్మాణం, సంస్కరణలు గురించి ఫ్రాన్సిస్ మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి అవసరమైన నిర్ణయాలను మండలి తీసుకోలేకపోయిందని అన్నారు. అయితే మండలిలో సంస్కరణల కోసం భారత్ చేస్తున్న కృషిని ఫ్రాన్సిస్ ప్రశంసించారు. ఐరాస మిషన్ల కోసం 2,50,000 కంటే ఎక్కువ మంది సైనికులను భారత్ అందించిందని గుర్తు చేశారు.