రబీకి అందని సాగు నీరు

Apr 24,2024 21:29

పాలకొండ: మండలంలో రబీలో సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రబీ సాగు చేస్తున్న రైతులకు సాగునీటి ఇబ్బందులు అంతా, ఇంతా కావు. మండలంలోని వేరు శనగ, మొక్కజొన్న, మినుములు తదితర పంటలు వేసిన రైతులు పొలాలకు సాగు నీరందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదేళ్లు తోటపల్లి ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడంతో సాగు నీరు విడుదల సక్రమంగా జరగటంలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో వెలగవాడలో నరసింహ చెరువులో ఐదేళ్లుగా మూడు బిందెలు నీరు కూడా ఉన్న పరిస్థితులు లేవు. ఆ చెరువు నుండే పిల్ల కాలువలకు నీరు వెళ్తుంది. కనీసం మూగ జీవాల దాహార్తిని తీర్చటానికి కూడా చెరువులో నీరు లేదు.

➡️