క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కొంత విరామం తీసుకున్న సొనాలీ బింద్రా ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘ది బ్రోకెన్ న్యూస్’ వెబ్సిరీస్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్థమయ్యారు. జీ5 వేదికగా మే 3 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ బిగినింగ్లో ఎదుర్కొన్న విమర్శల గురించి ఆమె చెప్పారు. ‘అరవింద్ స్వామి, మనీషా కొయిరాల కీలక పాత్రధారులుగా వచ్చిన ‘బొంబాయి’ చిత్రంలో నేను ఒక పాటలో కనిపించాను. అప్పటికి ఐదు సినిమాల్లో మాత్రమే నటించిన అనుభవం నాది. ఆ చిత్రం విడుదల తర్వాత నా కెరీర్ పూర్తిగా మారింది. అప్పటివరకు నాకు డ్యాన్స్ రాదని అందరూ విమర్శించేవారు. ఆ పాట చూశాక నన్ను కామెంట్ చేసినవారి ధోరణి మారింది. అప్పట్లో డ్యాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరనే భావన బలంగా ఉండేది. అందుకే సమయం దొరికినప్పుడల్లా డాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. బంబాయిలోని పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ కావడంతో దానిని నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఈ పాటతో మెప్పించాలి లేదంటే ఇండిస్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అదే నమ్మకంతో ఆ చిత్రంలో ‘హమ్మా.. హమ్మా పాట చేశారు. అది చూసిన కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ మూమెంట్స్ బాగా చేశానని రూ.100 బహుమతిగా ఇచ్చారు. అంతగొప్ప వ్యక్తి నన్ను ప్రశంసించినందుకు చాలా సంతోషించా. ఇండిస్టీలో కొనసాగవచ్చని నమ్మకం, ధైర్యం వచ్చింది. అందుకే ఆ సాంగ్ ఎప్పటికీ ప్రత్యేకమే. అది నేను హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో పాట కాకపోయినా నా పాటగా మారింది’ అని అన్నారు.