కార్పొరేట్, మతోన్మాద బిజెపిని ఓడించాలి 

Mar 29,2024 15:11 #Guntur District

ప్రజాశక్తి-మంగళగిరి : కార్పొరేట్ మతోన్మాద బిజెపిని రానున్న సారత్రిక ఎన్నికల్లో ఓడించడానికి వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తులు కృషి చేయాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చెంగయ్య్ అన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీల పోటీ చేస్తారని, వారిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో సిపిఐ ఎంఎల్ నాయకులు కూరపాటి కోటేశ్వరావు, దుర్గాప్రసద్ లను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిజెపి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెరిగిపోతున్నాయని అన్నారు. నిత్యవసర సరుకులను ధరలను అదుపు చేయలేకపోతున్నారు. కార్పొరేట్ల కోసం బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో జరిగే ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించడానికి వామపక్ష శక్తులన్నీ ఏకతాటి మీదకు రావాలని అన్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీని, ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, జేవి రాఘవులు, పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, స్థానిక సిపిఎం నాయకులు ఈ కాటమరాజు, డివైఎఫ్ఐ నాయకులు జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️