మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

Mar 23,2024 15:02 #Manyam District

సిపిఎం, గిరిజన సంఘం డిమాండ్ 
ప్రజాశక్తి-పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చిన కేర్జల పంచాయితీ బట్టి మానువలస గ్రామంలో భారీ గాలులు గాను ఈ గ్రామానికి చెందిన మొక్క జొన్న పండించే రైతులు పీడక జంగయ్య, మెల్లిగా సీతారాం, యు లక్ష్మీ, మెల్లిక సుబ్బారావు, పీడక సోములు, హెచ్ సురేష్, ఎం పరిశి రామ్, శాంతి కుమారి, మొదలగు రైతుల యొక్క మొక్కజొన్న పూర్తిగా పంట నేలకు ఒరిగింది. చేతికొచ్చే సందర్భంలో నేల పాలు అవడంతో గిరిజన రైతులు లబో దీబోమంటూ ఇబ్బంది పడే పరిస్థితి కావున వెంటనే సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి అకాల గాలుల వలన నష్టపోయిన మొక్కజొన్న రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో అధికారులకు కోరారు.. ఈ కార్యక్రమంలో లక్ష్యము సింగన్న రాము పాల్గొన్నారు.

➡️