పాఠశాల అభివృద్ధికి సహకారం

ప్రజాశక్తి-చీమకుర్తి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి 1985-86 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు సహ కారం అందించాలని తీర్మానిం చారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పలువురు విద్యార్థులు పాల్గొని మాట్లాడారు. మద్దిపాడు ఏఎంసి మాజీ అధ్యక్షుడు మారం వెంకారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాము చదువుకున్నామని, పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏడుకొండలు, బి వెంకయ్య, ముప్పూరి రంగారావు, గోపురపు శీను, షేక్‌ తాజావుద్దీన్‌, బక్క రత్నం, కామయ్య, హెప్సిబా, కోటేశ్వరి, సుబ్బమ్మ పాల్గొన్నారు.

➡️