ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపిని మరోసారి గెలిపించి మరింత అభివృద్ధికి సహకరించాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పల నాయుడు కోరారు. శనివారం బొప్పడాం, వల్లూరు, బొడ్డ పేట, పెద తరిమి, పినతరిమి, మాల్యాడ, తమ్మాపురం, ఆల్తి పాలెం, గుషిణి, చనమల్లపేట తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి మరింత అభివృద్ధికి ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యేగా తనను, సిఎంగా జగన్ మోహన్ రెడ్డిని, ఎమ్పిగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. ప్రతి పక్షాలు ఒంటరిగా వైసిపిని ఎదుర్కోలేక కూటమిగా కుతంత్రాలతో మాయ మాటలతో మభ్య పెడుతున్నాయని వారిని నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి వైసిపిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములు నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు చనమల్ల వెంకట రమణ, జడ్పిటిసి గదల సన్యాసి నాయుడు, వైస్ ఎంపిపి పతివాడ సత్యనారాయణ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డెరైక్టర్ రేగాన శ్రీనివాసరావు, బొప్పడాం సర్పంచ్ అంబళ్ళ కిరణ్, నాయకులు పంచాది శ్రీరాములు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.వైసిపి ఇంటింటి ప్రచారం డెంకాడ: మండల వైసిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడును, ఎమ్పి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించాలని కోరుతూ మండలంలోని గుణుపూర్ గ్రామంలో వైసిపి నాయకులు శనివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, ఎమ్మెల్యే తనయుడు వైసిపి ఐటి జోనల్ ఇన్ఛారఇజ బడ్డుకొండ మణిదీప్ మాట్లాడుతూ రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి ఎమ్మెల్యే, ఎమ్పి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో డెంకాడ పిఎస్సిఎస్ చైర్మన్ రొంగలి కనక సింహాచలం, గుణుపూర్ సర్పంచ్ సత్యం, డెంకాడ సర్పంచ్ పతివాడ గౌరీ, మహిళా నాయకులు పతివాడ కృష్ణవేణి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్దకు పాలనబొబ్బిలి: వైసిపి హయాంలో ప్రజల వద్దకు పాలన అందుతోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలోని 15వ వార్డులో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రజల వద్దకు పాలన అందిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, వైస్ చైర్పర్సన్ జి.రమాదేవి, వైసిపి నాయకులు శంబంగి శ్రీకాంత్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.తండ్రి కోసం తనయుడు ప్రచారంబొబ్బిలి నియోజకవర్గంలో తండ్రి కోసం తనయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బొబ్బిలి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంబంగి వెంకట చినప్పలనాయుడును గెలిపించుకునేందుకు ఆయన కుమారుడు శంబంగి శ్రీకాంత్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యేగా తన తండ్రి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు.