నియోగదారుల వారోత్సవాలను జయప్రదం చేయండి

Dec 18,2023 14:53 #srikakulam
consumers day in meliya putti

రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ఎల్ వీ చలం..
ప్రజాశక్తి-మెలియాపుట్టి : ఈనెల 18 నుండి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వినియోగదారుల వారోత్సవాలను జయప్రదం చేయాలని అన్నారు సోమవారం మెలియాపుట్టి మండలం కరజాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ వెంకట్రావు అధ్యక్షతన వినియోగదారుల చైతన్యం కోసం గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్ వీ చలం మాట్లాడుతూ వినియోగదారులు చైతన్యంగా ఉండాలని అందుకు 2019లో భారత ప్రభుత్వం గతంలో ఉండే లోపాలను సవరిస్తూ కొత్త చట్టం రూపొందించిందని అన్నారు
పాఠశాల స్థాయిలో జిల్లా నందు వంద కన్జ్యూమర్ క్లబ్బుల ద్వారా విద్యార్థులకు పలు అంశాలపై నెల నెలా క్లబ్ గైడెన్స్ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. జాతీయ వినియోగదారులదినోత్సవం సందర్భంగా వ్యాసరచన వక్త్రుత్వం మరియు క్విజ్ పోటీలు ఉంటాయి అన్నారు.  వీటికి పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ నగదు బహుమతులు అందజేస్తుందని తెలిపారు. అందుకు విద్యార్థులు ను సమాయత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగ దారుల క్ల బ్ గైడ్ ఎల్ వెంకటా చలం టీ గోపాల కృష్ణ సీ హెచ్ ఆదినారాయణ సీ హెచ్ యతి రాజారావు పీ రామారావు యస్ బాలరాజు అర్జునుడు ఎస్ బుడ్డు డీ దీన బందు తదితరులు పాల్గొన్నారు.

➡️