బాదితులకు పరామర్శ

Dec 7,2023 00:19

ప్రజాశక్తి – పర్చూరు
స్థానిక అంబేద్కర్ నగర్‌లోని ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ పంపిణి చేశారు. అనంతరం అంబేద్కర్ నగర్ వాస్తవ్యులుకు ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు కచ్చితంగా గవర్నమెంట్ నుండి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా గాయాలైన గ్రామస్తులకు తన సొంత డబ్బులతో ఏ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం చేపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమంచితో పాటు పర్చూర్ జెఎస్సి కన్వీనర్ ముప్పాళ్ళ రాఘవయ్య, మల్ల అంజమ్మ, కోట శీను, కాలీషా, హేమ, చెంగా అనిల్, జంగా విజయ, రామకృష్ణ, రాఘవ పాల్గొన్నారు.

➡️