ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చి దేశరాజధానిలో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన ‘చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’ అని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రివాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు, బీజేపీ చేస్తున్న ఈ కుట్రలు ఢిల్లీ ప్రజల ఆదేశానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ అధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారని.. సీఎం ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్ని ఉద్యోగం నుంచి తొలగించారని.. ఢిల్లీలో అధికారులను నియమించడం లేదని, బదిలీలు, పోస్టింగ్లు లేవని.. గత కొన్ని రోజులుగా ఎల్డీ ఎంహెచ్ఎక్ నిరాధారమైన లేఖలు రాస్తున్నారు. ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసినట్లుగా ఉందన్నారు.