తెలంగాణ : తుక్కుగూడలో నేడు కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను నిర్వహించిన వేళ … ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాచకొండ సిపి తరుణ్ జోషి వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిబంధనలు పాటించాలని చెప్పారు. పెద్ద అంబర్ పేట నుంచి పెద్దగోల్కండ రహదారిపై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ వాహనాలను అనుమతించబోరని సూచించారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను మళ్లించారు.