ప్రజాశక్తి-పెద్దదోర్నాల: మండలంలోని బొమ్మలాపురం గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి బూదాల అజితారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రిహానాబాను, కాంగ్రెస్ నాయకులు జబ్బార్, మస్తాన్, ఖాసింవలి, కొండయ్య, రాజయ్య, వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.