కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభం

Apr 17,2024 22:51
స్థానిక మార్కండేయపురంలో

ప్రజాశక్తి – గొల్లప్రోలు(పిఠాపురం)

స్థానిక మార్కండేయపురంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మల్లిపూడి మంగపతి రాజు ప్రారంభిం చారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పళ్లంరాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అప్పులు పెరిగాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రజలంతా పార్టీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో బలపరిచిన పిఠా పురం అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావును గెలుపించాలని కోరారు. అంతకు ముందు గొల్లప్రోలు పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి శ్రీనివాస్‌, సిపిఐ నాయకులు కేసవరపు అప్పలరాజు పాల్గొన్నారు.

➡️