ప్రజాశక్తి – బాపట్ల
కాంగ్రెస్ బాపట్ల ఎంఎల్ఎ సీటు స్థానికులకే ఇవ్వాలని కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు పఠాన్ రాజేష్ కోరారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని నడించిన స్థానిక నాయకులను గుర్తి లేకపోవడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైనారిటీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ ఎంఎల్ఎ అభ్యర్థిత్వాన్ని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొన్నేళ్ళుగా బాపట్లలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు కృషి చేసిన నాయకుల్లో తాను ఒకరినని చెప్పుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న స్థానికులను వదిలేసి ఎంఎల్ఎ అభ్యర్థిత్వాన్ని ఇతర ప్రాంతాల వారికి కేటాయిస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ప్రతి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేస్తున్న స్థానిక నాయకులను పట్టించుకోకపోతే పార్టీ జెండాలు మోసే వారే కరువు అవుతారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంపై పత్యేక శ్రద్ధ వహించి పార్టీకి పనిచేస్తున్న నాయకులను గుర్తించి స్థానికులకే సీటు కేటాయించాలని కోరారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.