20న గ్రూప్2 పరీక్షలపై సదస్సు

Dec 19,2023 00:35

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-2 ఉద్యోగ ప్రకటనలను పురస్కరించుకొని అభ్యర్థులకు ఈనెల 20న తెనాలి ఎన్జీఒ హోంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు వి సురేష్ కుమార్, ఎం శ్రీనివాసరావు తెలిపారు. గ్రూప్2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పరీక్షలు ఎలా ఉంటాయి? ఏఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎలా వ్రాయాలనే అంశాలను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వివరిస్తారని తెలిపారు. అబ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే సదస్సు అనంతరం 120పేజీల సిలబస్‌ పుస్తకాన్ని ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.

➡️