రాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంఎల్సి తోట త్రిమూర్తులు
ప్రజాశక్తి-మండపేట
ఇటీవల ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన మండలంలోని మారేడుబాక నివాసి కాదా రాజు కుటుంబ సభ్యులను ఆదివారం ఎంఎల్సి తోట త్రిమూర్తులు పరామర్శించారు. బాధితుల నివాసానికి వైస్ చైర్మన్ పిల్లి గణేష్, పెంకే గంగాధర్, శెట్టిబలిజ నాయకులతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజు చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పిం చారు. రాజు మరణం బాధాకరం అయినప్పటికీ అవయవ దానం చేసి అందరి మనసు గెలుచుకున్నారన్నారు. కార్యక్రమంలో మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు, వైసీపీ నాయకులు సూరంపూడి సత్యప్రసాద్, టేకి దుర్గారావు, కొండపల్లి రాజేంద్రప్రసాద్, యాండ్ర బుజ్జి, చొల్లంగి గోవిందు, ముల్లేటి వెంకటరమణ, వాసంశెట్టి కామేశ్వరరావు, వల్లు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.