నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా 

మా ఊరికి మాటిచ్చి వచ్చా..
ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు..

ప్రజాశక్తి-వి.ఆర్.పురం : నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. మా ఊరికి మాటిచ్చి వచ్చా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించి తీరుతానని రంపచోడవరం నియోజకవర్గ అభ్యర్థి లోతా రామారావు అన్నారు. శనివారం తెల్లవారిగూడెం, మొనకనపల్లి, గ్రామాల్లో జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు ఆధ్వర్యంలో పర్యటించి అక్కడి పరిస్థితులు ఆడిగితేలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి పోశమ్మతల్లీ, బాపనమ్మ తల్లీ ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. ఆశీర్వదించండి ఐదేళ్లు మీ ఇంటి పెద్దగా సేవ చేసే అవకాశం ఇవ్వండని ఆయన కోరారు. నాకు ఆస్తులు వద్దు, కార్లు అసలే వద్దు బంగాళాలు అసలు వద్దే వద్దు నియోజకవర్గమే నాకు ఇల్లు, పార్టీ కార్యాలయాలే చాంబర్లు, అసెంబ్లీ నాకు దేవాలయమని నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్ళుని ఆయన స్పష్టం చేశారు. ఆకలి అయితే గంజి నీళ్లు త్రాగైనా ఉంటాను కానీ అవినీతికి, డబ్బుకు కక్కుర్తిపడే నైజంలేదని, అవసరమైతే పార్టీ కార్యాలయంలోనే ఉంటాను. ప్రజా సేవ చేస్తానని ఆయన చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి అవకాశం ఇవ్వండని ఆయన అభ్యర్ధించారు. ఈ సమావేశంలో చింతూరు సిపిఎం జిల్లా సభ్యులు పల్లపు వెంకట్ ములకలపల సర్పంచ్ ఎస్ మారయ్య నూనె నాగేశ్వరరావు. సవలం కన్నయ్యనూనె సమ్మయ్య బంగారు వినోద్ నూనె రాజు, నూనె జోగారావు, .తెల్లం కన్నారావు, తెల్లం శాంతి రాజు, మాజీ సర్పంచ్ తెల్లం కన్నామ్మ, వెట్టి చంద్రర్ రావు, సొంది రాజయ్య, సొంది శంకరయ్య, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️