ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): రాబోవు వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రమైన నీరుని పట్టణ ప్రజలకి అందివ్వాలని నరసాపురం మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నరసాపురంలో పట్టణంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను, సమ్మర్ స్టోరేజి ట్యాంకును, ఆలమ్ నిల్వలను, క్లోరిన్ గ్యాస్ సిలిండర్ లను మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా కుళాయి చెరువులో నీటిని పూర్తి స్థాయిలో నింపాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని పట్టణ ప్రజలకి నీటి కొరత లేకుండా చూడాలన్నారు. అనంతరం వాటర్ వర్క్స్ లోని రికార్డులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ ఆర్. రమేష్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ వై.సునీల్ తదితరులు పాల్గొన్నారు.