లక్ష్మీప్రియకు కలెక్టర్ అభినందనలుప్రజాశక్తి-శ్రీకాళహస్తి రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో తిరుపతి జిల్లా టాపర్గా నిలిచిన పట్టణంలోని సరస్వతి భాయి మున్సిపల్ పాఠశాల విద్యార్థిని లక్ష్మీప్రియను శనివారం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అభినందించారు. పదో తరగతి ఫలితాల్లో లక్ష్మీప్రియ 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించింది. ఈ క్రమంలో విద్యార్థిని లక్ష్మీ ప్రియనుకలెక్టర్ తన చాంబర్లో ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. 596 మార్కులతో జిల్లా టాపర్ గానే కాకుండా, రాష్ట్రస్థాయిలో తిరుపతి జిల్లా ఖ్యాతిని లక్ష్మీ ప్రియా చాటి చెప్పిందంటూ కలెక్టర్ కొనియాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.