ప్రజాశక్తి-రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెరు పక్కన ఉన్న అభిరుచి అనే హోటల్ లో గురువారము ఉన్నపళంగా పెద్ద సొరంగం ఏర్పడింది. దీంతో అందులో పనిచేస్తున్న మరెన్న, తిప్పేష్, సిద్దన్న, రామాంజనేయులు, గీతలకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఈ హోటల్ ని శ్రీనివాసులు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నడుపుతున్నాడు. ఈ సంఘటన ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది.