సస్పెండ్ చేసిన వైసిపి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైసిపికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం పవన్కల్యాణ్ను కలిసి జనసేనలో చేరారు. శ్రీనివాసులును రాజ్యసభకు పంపుతారని వార్తలు వచ్చినా.. చివరి క్షణంలో ఆ పార్టీ మేడా రఘునాథ్రెడ్డిని పంపింది. చిత్తూరు వైసిపి టికెట్ను విజయానందరెడ్డికి ప్రకటించడంతో ఆయన జనసేన వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. పవన్కల్యాణ్ను శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్లో కలవగానే వైసిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.