ఇంటర్నెట్డెస్క్ : పట్టాల్లేకుండా ట్రైన్స్ నడవడం మీరెక్కడైనా చూశారా? ఈ అద్భుతాన్ని మీరు చూడాలనుకుంటే చైనాలో చూడొచ్చు. ఇప్పటివరకు ఎన్నో అద్బుతాలు సృష్టించిన చైనా.. మరో అద్భుతాన్ని సృష్టించింది. తాజాగా రోడ్డుపై నడిచే రైళ్లను చైనా ఆవిష్కరించింది. పట్టాల్లేకుండానే రోడ్డుపై ట్రైన్స్ వెళుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ట్రైన్స్ విద్యుత్తో నడుస్తాయి. ఈ ట్రైన్లో సుమారు వంద మందిదాకా ప్రయాణించవచ్చు. గంటకు 60 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ఆటోమేటిక్ టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల ట్రాఫిక్ సిగల్ పడితే ఆగుతుంది. విద్యుత్తో నడవడం వల్ల ఇది ఎలాంటి ఉద్గారాలను విడుదల చేయదు. పూర్తిగా కాలుష్య రహితం. ఇవి సిటీ బస్సుల మాదిరిగా ప్రయాణికులకు సౌకర్యంగా అందుబాటులో ఉండనున్నాయి.
Trackless train in China …pic.twitter.com/MsMrW4Wi26
— Figen (@TheFigen_) December 29, 2023