ప్రజాశక్తి – ఆరిలోవ(విశాఖపట్నం) : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో బుధవారం సాయంత్రం చీప అనే ఆడ చింపాంజీ (29) అనారో గ్యంతో మృతి చెందినట్టు జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా తెలిపారు. వయోకార్డిల్ కార్డియా అరెస్ట్ కారణంగా ఇది మృతి చెందినట్టు జూవెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నిర్ధారించినట్లు చెప్పారు. ఈ చింపాంజీ చీపను 2016లో ఇజ్రాయెల్ జూపార్కు నుంచి బహుమతిగా తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం జూ పార్కులో మరొక చింపాంజీ మాత్రమే ఉందని చెప్పారు.