ఎఎఫ్సి కప్ చివరి లీగ్లో సిరియా చేతిలో ఓటమి
ఖతార్: ఎఎఫ్సి ఆసియాకప్ ఫుట్బాల్ టోర్నీలో ఛెత్రీ సేన ఆకట్టుకోలేకపోయింది. గ్రూప్ లీగ్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ భారత్ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం జరిగిన మూడో, చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 0-1గోల్తో సిరియా చేతిలో ఓడింది. ఏకైక గోల్ను సిరియా ఆటగాడు ఖిబ్రిన్ 75వ ని.లో చేశాడు. ఈ ఓటమితో గ్రూప్-బిలో భారత్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి చివరిస్థానంలో నిలిచింది. ఇదే గ్రూప్లో ఉన్న ఆస్ట్రేలియా 3మ్యాచుల్లో 2 గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకొని 7పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఉబ్జెకిస్తాన్ ఒక మ్యాచ్లో గెలిచి రెండు మ్యాచ్లను డ్రా చేసుకొంది. దీంతో ఆ జట్టు 5పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి నాకౌట్కు అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఆడి మూడు మ్యాచుల్లోనూ ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోగా.. 6గోల్స్ సమర్పించుకొంది. ఆస్ట్రేలియాపై 2-0తో, ఉబ్జెకిస్తాన్పై 3-0తో, సిరియాపై 1-0తో ఛెత్రీసేన పరాజయాల్ని చవిచూసింది.