తెలంగాణ : బిఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ … ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా బిఆర్ఎస్ కు రాజీనామా చేశానన్నారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఇచ్చిన కెసిఆర్, కెటిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బిఆర్ఎస్ లో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.