నెరవేరిన చంద్రన్న హామీ : చంద్రబాబుతో రూ.5లక్షల అందజేసిన ఏలూరి

Dec 29,2023 23:27

ప్రజాశక్తి – పర్చూరు
మిచాంగ్‌ తుఫాను ప్రభావంతో సర్వం నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నియోజకవర్గంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కొద్దిరోజుల క్రితం వచ్చారు. అప్పట్లో అన్నదాతలను ఆదుకునేందుకు హామీ ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను ఓదార్చి రైతులకు అండగా ఉంటానని బరోసా ఇచ్చారు. అధినేత హామీ మేరకు టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తరపున టిడిపి మండల నేతలు ఐదుగురు రైతులకు రూ.5లక్షలు శుక్రవారం అందజేశారు. చెరుకూరు రైతులకు చంద్రబాబు ఇచ్చిన భరోసా మేరకు గ్రామానికి చెందిన నాలుగున్నర ఎకరాల పొగాకు సాగు చేసిన రైతు కత్తి బుషికి రూ.60వేలు, గడ్డం అంకయ్య అనే రైతుకు రూ.2లక్షలు, వై నారాయణస్వామి అనే రైతుకు రూ.2.05లక్షలు, కె కృష్ణ అనే రైతుకు రూ.30వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.

➡️