మార్కాపురం వీధుల్లో కేంద్ర బలగాల మార్చ్

Mar 8,2024 16:18 #Prakasam District

ప్రజాశక్తి-మార్కాపురం : సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికలు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు మార్కాపురంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ బాల సుందర రావు ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, సెవెన్ హిల్స్, దోర్నాల బస్టాండ్, కంభం సెంటర్, కోర్టు ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహిస్తూ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు వెంకటేశ్వర్లు నాయక్ అబ్దుల్ రహమాన్ సువర్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️