బడా బాబుల లాభాల కోసమే బడ్జెట్లు

Feb 28,2024 17:21 #Kakinada
Central and state budgets are for the profit of corporats

ప్రజాశక్తి – పెద్దాపురం :  కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజల కోసం కాకుండా బడా బాబులకు లాభాలు చేకూర్చేందుకే బడ్జెట్ లు రూపొందిస్తున్నాయని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఏ అజ శర్మ అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో యుటిఎఫ్ నాయకులు కెనడి అధ్యక్షతన జరిగిన యుటిఎఫ్ నాయకులు లక్ష్మీనారాయణ 9వ వర్ధంతి సభ లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గతంలో బడ్జెట్ లు ప్రతిపాదించినప్పుడు ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో ప్రజల్లో ఆసక్తి ఉండేదన్నారు. ఇప్పుడు బడ్జెట్ లు వస్తువుల ధరలు పెరగటం, కార్పొరేట్ లకు రాయితీలు కోసమే పరిమితమయ్యాయన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అన్నారు. ఈ సభా కార్యక్రమానికి ముందు లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జోషుల కృష్ణ బాబు, రొంగల వీర్రాజు, సీతారామారావు, బి అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

➡️