ప్రజాశక్తిలో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ వేడుకలు

విజయవాడ : నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని … తాడేపల్లిలోని ప్రజాశక్తి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు, మహిళలకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. పిల్లలు, మహిళలు, ప్రజాశక్తి మహిళా సిబ్బంది కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. నాటికలు వేశారు. కోలాటాలు, ఆటలు, పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఎస్‌ఐ అధికారిణి పి.పార్వతి విచ్చేశారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

 

 

 

 

 

➡️