చెరువులో వడ్రంగి మృతదేహం

Mar 25,2024 13:28 #Eluru district

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు మండలం నాచుగుంట గ్రామ పరిధిలో గల కోటవాని చెరువులో మృతదేహన్ని చేబ్రోలు పోలీసులు సోమవారం కనుగొన్నారు. నిడమర్రు మండలం చిననిండ్రకొలనుకి చెందిన సాయి రమేష్ గత కొంత కాలంగా ఉంగుటూరు మండలం సీతారాంపురంలో ఉంటూ వడ్రంగి వృత్తితో జీవిస్తున్నాడు. ఇటీవల అతనికి ప్రేమ వివాహం అయింది. ఫేస్ బుక్ లో మరో యువతితో పరిచయం అయింది. ఈ క్రమంలో చెరువులో తేలుతూ ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

➡️