కరపలో అంగన్వాడీల మానవహారం

Dec 21,2023 15:09 #Kakinada

ప్రజాశక్తి – కరప(కాకినాడ) : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా10 వ రోజు  గురువారం అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వయిస్తున్న సమ్మెలో సీఐటీయూ , అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పి వీరవేణి, ఎస్.వరలక్ష్మి, ఎస్ ఎస్ కుమారి, దైవ కుమారి ,అచ్చారత్నం ,కల్పలత, హెల్పర్ సత్యా మాధవి.ఎం భవాని, నారాయణమ్మ, జ్యోతి,కల్పలత, పి లక్ష్మి, ఏ దేవి, బి మనోజ, లక్ష్మి,సాయి దుర్గ, బి భవాని,తదితర  అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️