బర్రెలక్క కోసం పార్టీల అభ్యర్థులు వైదొలగాలినేనూ ప్రచారం చేస్తా.. : జెడి లక్ష్మీనారాయణ

Nov 26,2023 21:05 #JD Lakshminarayan, #speech

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా)తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (కర్నె శిరీష)ను గెలిపించి, భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ కోరారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీ నుండి తప్పించి బర్రెలక్కకు మద్దతుగా నిలవాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విజె కాలేజీలో ఆదివారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ప్రజలకు చేసిన హెచ్చరికలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన, వ్యక్తి పూజలు రాచరికానికి దారితీస్తాయని తెలిపారు. మనకోసం మనం రాసుకున్న రాజ్యాన్ని పరిరక్షించాలంటే, ఎన్నికల్లో డబ్బున్న వారికి కాకుండా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. అందుకే తాను బర్రెలక్క కోసం ప్రచారం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో విజె కాలేజీ డైరెక్టర్‌ పి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️