టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విదిత్ గుజరాతీ వరుసిగా రెండో ఓటమిని చవిచూశాడు. సోమవారం జరిగిన నాల్గోరౌండ్ పోటీలో విదిత్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఇయాన్ నెపోమ్నియాచి చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. 44ఎత్తులపాటు సాగి ఈ సమయచంలో చివరి విదిత్ ఓటమిని అంగీకరించాడు. ఇక కోనేరు హంపి అరంగేట్రం ఆటగాడు సూర్గ్యుల్ సామిమోవా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. అనుభవజ్ఞురాలైన హంపి 20ఏళ్ల నూర్గ్యుల్ చేతిలో ఓటమి నిరాశపరిచింది. ఇక ప్రజ్ఞానంద, విశాలి, గుకేశ్ ప్రత్యర్థులతో మ్యాచ్లను డ్రాగా ముగించారు. నాల్గోరౌండ్ ముగిసేసరికి జోంగీ టాంగ్(చైనా) 3పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.