కాంగ్రెస్‌ సీటు కోసం దరకాస్తు

Feb 17,2024 00:07

ప్రజాశక్తి – భట్టిప్రోలు
వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ సీటు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు బూరగ సుబ్బారావు విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వివిధ మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుబ్బారావు ప్రజలతో మమేకమవుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్‌కు పిసిసి బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో పూర్వ వైభవం వస్తుందన్నారు. రాష్ట్రంలో విభజన అనంతరం అధికారం చేపట్టిన ప్రాంతీయ పార్టీలు రెండు బిజెపి భజన చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ అధికారానికి వస్తేనే సాధ్యమని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానిగా ఎన్నుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర పౌరులపై ఉందన్నారు. తనకు అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ను గెలిపిస్తానని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గంట అంజిబాబు, వేమూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తాడికొండ వెంకటేశ్వరరావుతో కలసి వినతి పత్రాన్ని అంద జేసినట్లు తెలిపారు.

➡️