కారం జానకిరామ్‌కి సిపిఎం కార్యకర్తల పరామర్శ

Apr 13,2024 18:36 #West Godavari District

ప్రజాశక్తి-విఅర్‌ పురం: మండలంలోని చోప్పల్లి గ్రామ సిపిఎం సభ్యులు కారం జానకిరామ్‌ ఇటీవల పేరాలసిస్‌ రావడంతో వైద్యం చేయించుకుంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం విఆర్‌ పురం సిపిఎం మండల కమిటీ సభ్యులు, నాయకులు ఆయన ఇంటివద్దకు వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని అన్నారు. పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్న బాబు, పంకు సత్తిబాబు, ఎంపీపీ కారం లక్ష్మి , మండల నాయకులు వడ్లాది రమేష్‌, కారం సుందరయ్య , ఆసు లక్ష్మయ్య , గుండెపూడి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.

➡️