ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్-2023లో అత్యుత్తమ ఇంధన సామర్ధ్య అవార్డును అందుకున్న నేపథ్యంలో ఇంధనశాఖ అధికారు లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇటీవల ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అధికారులు అందుకున్నారు. ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, జెన్కో ఎమ్డి కెవిఎన్ చక్రధర్బాబు, జెఎమ్డి బి మల్లారెడ్డి, ఎపిఎస్ఇసిఎం సిఇఒ బిఎవిపి కుమార్ రెడ్డి సోమవారం కలిశారు. అవార్డు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వరుసగా రెండేళ్లలో రెండుసార్లు ఈ అవార్డును రాష్ట్రం దక్కించుకుంది.