సిఎం జగన్మోహన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి : మాజీ ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మదనపల్లె (అన్నమయ్య) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు షాజహాన్‌ బాష డిమాండ్‌ చేశారు. టిడిపి ఆఫీసులో గురువారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఐదు కోట్ల ప్రజల గుండికాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం చాలా దుర్మార్గం అన్నారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రజల ఒక్కొక్కరి నెత్తిన రూ. రెండు కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చేసారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పాలించే అర్హత లేదన్నారు. వెంటనే సిఎంను పదవి నుంచి భర్తరఫ్‌ చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని టీడీపీ తరపున డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

➡️