రెగ్యులర్ చేయాలని లైన్మెన్ల మహాధర్నా

Jan 19,2024 14:24 #CITU, #Protest, #Tirupati district
citu protest for regularization in tpt

ప్రజాశక్తి-తిరుపతి : ఏపీ ఎస్పీడీసీఎల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రేటు 2 లైన్మెన్లు మహాధర్నా చేపట్టారు. ఎనర్జీ అసిస్టెంట్లు జేఎల్ఎం గ్రేడ్ 2ల హక్కుల సాధనకై మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, యూఈఈయు రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ ప్రకారం గ్రేటు లైన్మెన్లు రెగ్యులర్ చేయాలి. ప్రొవిజేషన్ డిక్లర్ ను వెంటనే విడుదల చేయాలి. 2022 అరియర్స్ లు వర్తింప చేయాలి. ప్రమాదంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారాన్ని అందజేయాలి. కారుణ్య నియమాల కింద వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం ఇప్పించాలని తదితర డిమాండ్లతో ఈ మహాధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోవు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ సుదర్శన్ రెడ్డి సుమన్ శివప్రసాద్, జిబిఎస్ మన్యం మునిరాజా తదితరులు పాల్గొన్నారు.

➡️