సిఐటియు నాయకులు సుధారాణి గృహ నిర్భంధం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మిమ్స్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ … నెలలు తరబడి ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. శనివారం మిమ్స్‌ ఉద్యోగుల నిరసనను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. యాజమాన్యం చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయకుండా పోలీసులను ఉపయోగించి సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టులు చేయించడం, గృహనిర్బంధం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. శనివారం విజయనగరంలో ఉంటున్న సిఐటియు నాయకురాలు బి.సుధారాణి ను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్భంధం చేశారు. పోలీసులు ఇంటి బయట ఉండి గృహనిర్బంధం చేశారు. ఇంటి బయట పోలీసులు కాపలాగా ఉన్నారు.

➡️