లోకేష్‌కు సిఐడి నోటీసులు

Dec 30,2023 10:35 #Nara Lokesh
nara lokesh on ycp govt

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెడ్‌బుక్‌ పేరుతో అధికారులను టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బెదిరిస్తున్నారంటూ ఎపి సిఐడి కోర్టును ఆశ్రయించిన కేసులో లోకేష్‌కు శుక్రవారం సిఐడి నోటీసులు జారీ చేసింది. 41ఎ సెక్షన్‌ను నారా లోకేష్‌ ఉల్లంఘించారని, ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతినివ్వాలని ఎసిబి కోర్టును సిఐడి ఆశ్రయించింది. ఈ కేసును ఎసిబి కోర్టు జనవరి 9కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు శుక్రవారం వాట్సాప్‌లో నోటీస్‌ను లోకేష్‌కు పంపారు. సిఐడి పంపిన నోటీసులను అందుకున్నట్లు సిఐడి అధికారులకు లోకేష్‌ సమాచారం అందజేశారు.

➡️