ప్రజాశక్తి-విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు, వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో భేటీ అయ్యారు. వీరితో పాటు బిజెపి, సీపీఎం, బీఎస్పీ, ఆప్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై విపక్ష నేతలు సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమావేశానికి ముందు చంద్రబాబు, పవన్ నోవాటెల్లో భేటీ అయ్యారు. ఈసీకి నివేదించాల్సిన అంశాలపై చర్చించారు.