న్యూఢిల్లీ : 10, 12 తరగతుల బోర్డు పరీక్షల తేదీలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) మంగళవారం ప్రకటించింది. ఈ రెండు తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 13తో ముగుస్తుండగా, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ముగుస్తాయి. పరీక్షల తేదీలను నిర్ణయించేటప్పుడు రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఉండే విధంగా బోర్డు చర్యలు తీసుకుందని, 12వ తరగతి షెడ్యూల్ను నిర్ణయించేటప్పుడు జెఇఇ వంటి పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకున్నామని సిబిఎస్ఇ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు.