ఎంపీ కేశినేని నానిపై చిన్ని తీవ్ర విమర్శలు

ప్రజాశక్తి-అమరావతి :సీఎం జగన్‌ను కలిసిన అనంతరం కేశినేని నాని విమర్శలు చేసిన నేపథ్యంలో చిన్ని స్పందించారు. లోకేషను, విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని అన్నారు. నాలుగేళ్ల నుంచి నాని వైసీపీతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. తమ కుటుంబంలో 1999 నుంచి కలహాలు ఉన్నాయని.. నాని ఎన్ని అంటున్నా తానే సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు. వాటితో తెదేపా అధినేత చంద్రబాబుకు సంబంధమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షను మరచి మాట్లాడటం తగదని.. ఎంతోమంది మహామహులు టిడిపిన వీడినా పార్టీకి ఏమీ కాలేదని.. వచ్చేవాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారని తెలిపారు.

➡️