న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలతో పాటు 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా బీహార్లో అజియాన్(ఎస్సి) నియోజకవర్గానికి, గుజరాత్లో విజపూర్, కాంభత్, వఘోడియా, మనవదర్, పోర్బందర్, హర్యానాలో కర్నాల్, జార్ఖండ్లో గాండేయ్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్రలో అలోక్ వెస్ట్, త్రిపురలో రామ్నగర్, ఉత్తరప్రదేశ్లో దద్రౌల్, లక్నో ఈస్ట్, గెయిన్సరి, దుద్ది, పశ్చిమ బెంగాల్లో భగవాన్గోలా, బారానగర్, హిమాచల్ప్రదేశ్లో ధర్మశాల, లాహౌల్, సుజన్పూర్, బర్సర్, గాగ్రెట్, ఖుతేల్హర్, రాజస్థాన్లో బగిడోరా, కర్ణాటకలో సోరపూర్, తమిళనాడులో విలవన్కోడే నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.