ప్రజాశక్తి-దోర్నాల : ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని శ్రీశైలం రహదారిలో వాసవి లాడ్జ్ తెల్లవారు జామున 4 గంటలకు కుప్పకూలింది. పరుచూరి సుబ్బారావుకి చెందిన మూడంతస్తుల లాడ్జి కుప్పకూలింది. దాని పక్కన సోదరుడైన రామారావు బిల్డింగ్ కట్టించుకొనుటకు 10 రోజుల క్రితం దాదాపు 15 అడుగుల వరకు పునాది కొరకు మట్టి తీసి బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. లాడ్జి అద్దెకు తీసుకున్న వ్యక్తికి రెండు రోజుల నుంచి బిల్డింగ్ పై అనుమానం వచ్చి యజమానికి చెప్పి లాడ్జిని అద్దెకు జనాలకు ఇవ్వకుండా కాలిగా ఉంచి కావలి ఉంటున్నాడు. అదృష్టవశాతు కావలి ఉండడంతో జనాలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి చూస్తున్నారు.