రేపటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు..  నేడు అఖిలపక్ష భేటీ

Jan 30,2024 08:06

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ ప్రభుత్వ చివరి పార్లమెంటు (బడ్జెట్‌) సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభ సజావుగా సాగడంతోపాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. ఇక లోక్‌సభ చివరి సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 9 వరకూ జరగనున్నాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. మధ్యంతర బడ్జెట్‌పై కూడా చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాలు కేవలం పది రోజులే కావడంతో, ఈ స్వల్ప కాలంలో ఏయే అంశాలు లేవనెత్తాలో ప్రతిపక్షాలు చర్చిస్తున్నాయి. 17వ లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనున్నది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంటు సమావేశం కావడం ఇదే చివరిసారి.

➡️